తెలంగాణ

telangana

కారం కొట్టి.. నగల వ్యాపారి నుంచి రూ.10లక్షలు చోరీ

By

Published : Feb 24, 2023, 9:57 PM IST

Thieves who stole money in Rangareddy district: దొంగతనం వృత్తిగా చేసుకున్న వారు రకరకాలుగా దోపిడీలు చేస్తునే ఉంటారు. వీరిని దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు పెట్టిన ప్రయోజనం లేకుండా పోతుంది. ప్రతి ప్రాంతంలో దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెబుతున్నారు. కొంత మంది పెడచెవిన పెడుతున్నారు. ఆ వ్యాఖ్యలు విని వదిలేస్తున్నారే తప్ప పెద్దగా పట్టించుకోడం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో రాజేంద్రనగర్​ జిల్లాలో రూ.10లక్షలు చోరీ జరిగింది.

Thieves who robbed Rs.10 lakhs
రూ.10 లక్షలు దోచేసిన దొంగలు

Thieves who stole money in Rangareddy district: డబ్బులతో పాటు ప్రయాణిస్తున్నప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నమో! ఇంక అంతే సంగతులు. మనల్ని అప్పటి వరకు పరిశీలిస్తున్న దొంగలు అదే అదునుగా చేసుకొని మనదగ్గర ఉన్న నగదును కాజేస్తారు. దొంగతనం చేసేవారు మనల్ని బెదిరించి డబ్బును, బంగారాన్ని.. విలువైన వస్తువులను దోచుకుంటారు. ఈ ప్రయత్నంలో ఒక్కోసారి ఎంతటి ఘోరం చేయడానికైనా దొంగలు వెనకాడరు. ఇలాంటి సందర్భంలోనే ఒకోసారి అమాయకుల ప్రాణాలు పోతాయి.

అందుకే ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా విలువైన వస్తువులతో వెళ్తుంటే మరింత జాగ్రత్త వహించాలి. లేదంటే భారీగా మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్​లో నగలు వ్యాపారి దగ్గర నుంచి దారి దోపిడీ దొంగలు రూ.10 లక్షలు దొంగిలించారు.

బాధితుడి తెలిపిన వివరాల ప్రకారం.. ఓ నగల వ్యాపారి మహబూబ్​నగర్ జిల్లా నారాయణపేట్ నుంచి ఆర్టీసీ బస్సులో హైదరాబాద్​లో వస్తున్నాడు. శివరాంపల్లి వద్ద ఆర్టీసి బస్సును దుండగలు అడ్డుకున్నారు. రాజేంద్రనగర్​ ఎన్​పీఏ జంక్షన్​ దగ్గర దారి దోపిడీ దొంగ నేరుగా బాధితుడు కూర్చోన్న సీటు దగ్గరకి వెళ్లి అతని చేతిలో ఉన్న బ్యాగ్​ను పట్టుకుని పారిపోయాడు.

దుండగుడిని బాధితుడు పట్టుకుంటుండగా అతనిపై కళ్లలో కారం చల్లాడు. అనంతరం కత్తితో బెదిరించి బ్యాగ్​తో సహా పారిపోయాడు. ఆ బ్యాగ్​లో రూ.10లక్షలు ఉన్నట్లు బాధితుడు తెలిపాడు. వెంటనే బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. స్థానిక పోలీస్​ స్టేషన్​లో బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదులో ముగ్గురిపై అనుమానం ఉన్నట్లు బాధితుడు తెలిపాడు.

"నేను సాధారణంగా నారాయణపేట్​ నుంచి హైదరాబాద్​ వెళ్తూ ఉంటాను. ఆర్టీసీ బస్సులో హైదరాబాద్​ వెళ్తుంటే గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి నా కళ్లలో కారం చల్లి, కత్తితో బెదిరించి బ్యాగ్​ పట్టుకెళ్లారు. ఆ బ్యాగ్​లో రూ.10లక్షలు ఉన్నాయి. వెంటనే పోలీస్ స్టేషన్​కి వచ్చి ఫిర్యదు చేశాను." -బాధితుడు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details