నిషేదం విధించిన చైనా టపాసులు అమ్మినా... కాల్చినా... చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని తన కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసే టపాసుల దుకాణ యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తమ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో అనుమతి పొందాలని సూచించారు. క్రాకర్స్ దుకాణ యజమానులు అగ్నిమాపక జాగ్రత్తలు తీసుకోవాలని డీసీపీ తెలిపారు.
'టపాసుల దుకాణాల వద్ద అగ్నిమాపక జాగ్రత్తలు తీసుకోండి'
రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో తాత్కాలిక టపాసుల దుకాణ యజమానులతో డీసీపీ ప్రకాశ్రెడ్డి సమావేశం నిర్వహించారు. దుకాణ యజమానులు కచ్చితంగా అగ్నిమాపక జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు.
SHAMSHABAD DCP CONDUCTED MEETING WITH CRACKERS SHOP KEEPERS