తెలంగాణ

telangana

ETV Bharat / state

'టపాసుల దుకాణాల వద్ద అగ్నిమాపక జాగ్రత్తలు తీసుకోండి'

రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లో తాత్కాలిక టపాసుల దుకాణ యజమానులతో డీసీపీ ప్రకాశ్​రెడ్డి సమావేశం నిర్వహించారు. దుకాణ యజమానులు కచ్చితంగా అగ్నిమాపక జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు.

SHAMSHABAD DCP CONDUCTED MEETING WITH CRACKERS SHOP KEEPERS

By

Published : Oct 24, 2019, 11:45 PM IST

నిషేదం విధించిన చైనా టపాసులు​ అమ్మినా... కాల్చినా... చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లోని తన కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసే టపాసుల దుకాణ యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తమ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో అనుమతి పొందాలని సూచించారు. క్రాకర్స్​ దుకాణ యజమానులు అగ్నిమాపక జాగ్రత్తలు తీసుకోవాలని డీసీపీ తెలిపారు.

'టపాసుల దుకాణాల వద్ద అగ్నిమాపక జాగ్రత్తలు తీసుకోండి'

ABOUT THE AUTHOR

...view details