తెలంగాణ

telangana

By

Published : May 23, 2020, 10:26 PM IST

ETV Bharat / state

కరోనా వీరులకు వైద్యపరీక్షలు

కరోనా వైరస్​తో ప్రథమ వరుసలో నిలబడి యుద్ధం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జల్​పల్లి మున్సిపాలిటీలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మంత్రి కేటీఆర్​ ఆదేశాల మేరకు సిబ్బందికి వైద్యపరీక్షలు నిర్వహించినట్లు మున్సిపల్​ ఛైర్మన్​ అహ్మద్ సఫీఉల్లాహ్ తెలిపారు.

health camp for sanitary workers in Jalpalli Municipality
కరోనా వీరులకు వైద్యపరీక్షలు

రంగారెడ్డి జిల్లా జల్​పల్లిలో పారిశుద్ధ్య కార్మికులకు కొవిడ్‌-19 నేపథ్యంలో ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. మున్సిపల్‌ ఛైర్మన్​ అహ్మద్ సఫీఉల్లాహ్ శిబిరాన్ని పర్యవేక్షించారు. రాష్ట్ర పుర పాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు మున్సిపల్​ కార్మికులకు, విద్యుత్​, నీటి సరఫరా సిబ్బందికి నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం వారికి మందులు పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details