తెలంగాణ

telangana

రంగారెడ్డిలో కరోనా కలకలం

రంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. శంకర్​పల్లికి చెందిన ఓ కానిస్టేబుల్​కు కరోనా నిర్ధరణ కాగా.. మొయినాబాద్​లోని నలుగురి వైరస్​ సోకినట్టు అధికారులు వెల్లడించారు.

By

Published : May 28, 2020, 9:47 AM IST

Published : May 28, 2020, 9:47 AM IST

corona updates in rangareddy
రంగారెడ్డిలో కరోనా కలకలం

రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మండలం పర్వేద గ్రామానికి చెందిన కానిస్టేబుల్​కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు బుధవారం నిర్ధరించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్​ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్​ కొద్ది రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యాడని పేర్కొన్నారు.

కానిస్టేబుల్​ కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని వైద్యులు తెలిపారు. మొయినాబాద్ మండలంలో తొలి కరోనా కేసు నమోదైంది. ముషీరాబాద్​లోని ఒక వ్యక్తికి కరోనా సోకింది. అతనితో పాటు తన సన్నిహితులైన ముగ్గురికి పాజిటివ్​ అని నిర్ధరణ అయ్యింది.

ఇదీ చదవండి:'మైలురాయిని మంచి కోసం ఉపయోగించిన సామ్'

ABOUT THE AUTHOR

...view details