తెలంగాణ

telangana

'ఓటు ఆయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకోండి'

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈనాడు- ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ హాజరయ్యారు.

By

Published : Jan 7, 2020, 9:36 PM IST

Published : Jan 7, 2020, 9:36 PM IST

in ibrahimpatnam
ఓటు హక్కుపై అవగాహన సదస్సు

ఓటు హక్కును ప్రతి ఒక్కరు.. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా.. వినియోగించుకోవాలని ఎల్బీనగర్ డీసీపీ సన్​ప్రీత్ సింగ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈనాడు- ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్, ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఏసీపీ యాదగిరి రెడ్డి తదితరులు హాజరయ్యారు.

విద్యార్థులకు ఓటు ప్రాముఖ్యత గురించి వివరించారు. సమాజంలో మార్పు రావాలంటే ఓటు అనే ఆయుధాన్ని యువత తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు. ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని అన్నారు.

ఓటు హక్కుపై అవగాహన సదస్సు

ఇదీ చదవండి:'చట్టాలు అప్పటివే.. మార్పు రావాల్సిన అవసరం ఉంది'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details