ప్రతి ఒక్కరూ భద్రతా ప్రమాణాలు పాటించినప్పుడే... ప్రమాదాలు జరగకుండా నివారించగలమని రాష్ట్ర కర్మాగారాల డైరెక్టర్ బి.రాజగోపాల్రావు పేర్కొన్నారు. నిర్మాణం, విద్యుత్, ఉత్పత్తి తదితర రంగాల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు... హక్కులతో పాటు భద్రతాపరమైన బాధ్యతలు కూడా తెలుసుకోవాలని సూచించారు. సిబ్బంది భద్రత కోసం రామోజీ గ్రూప్ సంస్థలు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని కొనియాడారు.
రామోజీ ఫిల్మ్సిటీలో నిర్వహిస్తున్న 49వ జాతీయ భద్రతా వారోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకుముందు జెండా ఆవిష్కరించి... సిబ్బందితో భద్రతా ప్రమాణం చేయించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి వారోత్సవాలను ప్రారంభించారు.