తెలంగాణ

telangana

ETV Bharat / state

పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత: ఎస్పీ రాహుల్ - 6th phase haritha haaram

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పోలీస్​స్టేషన్​లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఎస్పీ రాహుల్​ హెగ్డే పాల్గొన్నారు. సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు.

rajanna siricilla sp rahul hegde participated in haritha haaram in vemulawada
'పర్యావరణాన్ని రక్షించుకోవటం ప్రతీ ఒక్కరి బాధ్యత'

By

Published : Jun 27, 2020, 5:58 PM IST

పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని... దానికోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు. ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా వేములవాడ పట్టణ పోలీస్​స్టేషన్​లో అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. డీజీపీ ఆదేశాల మేరకు విస్తృతంగా మొక్కలు నాటుతున్నట్లు ఎస్పీ తెలిపారు.

చెట్లను మానవాళి అవసరాల కోసం నరికివేయడం, అందుకు అనుగుణంగా మొక్కల పెంపకం చేపట్టకపోవడం కారణంగా కరవు పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటడాన్ని ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రకాంత్, సీఐలు వెంకటేశ్​, నవీన్ కుమార్, ఎస్సైలు నరేశ్​ కూమర్, సౌమ్య తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ఆ ఒక్క కారణంతో 18 వేల మంది ఖైదీలు విడుదల

ABOUT THE AUTHOR

...view details