తెలంగాణ

telangana

ETV Bharat / state

వేములవాడకు పోటెత్తిన భక్తజనం

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవుదినం కావడంతో.. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మరో రెండు రోజులు రద్దీ కొనసాగే అవకాశం ఉంటుందని ఆలయ అధికారులు భావిస్తున్నారు.

By

Published : Jan 24, 2021, 2:20 PM IST

bevops visits vemulawada temple in rajanna sircilla district
వేములవాడకు పోటెత్తిన భక్తజనం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం రోజు భక్తుల సందడి పెరిగింది. కొమురవెల్లి మల్లన్న జాతర.. సమ్మక్క చిన్నజాతర ఉండటంతో స్వామి వారి దర్శనం కోసం భారీగా తరలిరాగా.. భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మరాయి.

కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు కోడె మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉదయం నుంచి ఇప్పటివరకు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వచ్చే రెండు రోజులు రద్దీ కొనసాగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

ఇదీ చూడండి:వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details