తెలంగాణ

telangana

By

Published : Feb 23, 2020, 3:01 PM IST

ETV Bharat / state

బూడిద లోడుతో వెళ్తున్న లారీ బోల్తా... డ్రైవర్, క్లీనర్ మృతి

పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం కుందనపల్లి వద్ద రాజీవ్ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. బూడిద లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ అక్కడిక్కడే మృతి చెందారు.

yash-lorry-roll-over-at-peddapalli-district
బూడిద లోడుతో వెళ్తున్న లారీ బోల్తా... డ్రైవర్, క్లీనర్ మృతి

పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం కుందనపల్లి వద్ద రాజీవ్‌ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ బోల్తా పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గోదావరిఖని నుంచి ఎన్టీపీసీ యాష్‌ పాండ్‌కు బూడిద లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది.

చెట్టును వాహనం ఢీకొట్టడం వల్ల లారీ క్యాబిన్​లో డ్రైవర్ తల తెగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు క్లీనర్‌ కూడా అక్కడిక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలికి చేరుకున్న ఎస్సై రామకృష్ణ... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బూడిద లోడుతో వెళ్తున్న లారీ బోల్తా... డ్రైవర్, క్లీనర్ మృతి

ఇదీ చూడండి :కేసీఆర్ ఎర్రవల్లికి సర్పంచా... చింతమడకకు ఎంపీటీసీనా?: రేవంత్

ABOUT THE AUTHOR

...view details