తెలంగాణ

telangana

By

Published : May 6, 2021, 12:54 PM IST

ETV Bharat / state

స్వచ్ఛందంగా లాక్ డౌన్ ప్రకటించుకుంటోన్న ప్రజలు

కరోనా దృష్ట్యా.. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం 12వ డివిజన్​లోని ప్రజలు​.. స్వచ్ఛందంగా లాక్ డౌన్ ప్రకటించుకున్నారు. ప్రజలంతా కొవిడ్​ నియమాలను పాటించాలని కార్పొరేటర్ రజిత కోరారు.

self lockdown
self lockdown

పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో.. రోజురోజుకు పెరుగుతోన్న కొవిడ్ కేసులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా 12వ డివిజన్​లోని విట్టల్ నగర్ వాసులు.. స్వచ్ఛందంగా లాక్ డౌన్ ప్రకటించుకున్నారు. లాక్ డౌన్ నియమాలను పాటిస్తామంటూ.. కార్పొరేటర్ రజిత స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు.

ప్రజల సంక్షేమం దృష్ట్యా.. వారం రోజుల పాటు లాక్​ డౌన్​ నిర్ణయం తీసుకున్నట్లు కార్పొరేటర్ తెలిపారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరుచుకుని ఉంటాయన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా.. తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ఇదీ చదవండి:బెల్లంపల్లి ఐసోలేషన్‌ కేంద్రంలో 8 మంది కొవిడ్ రోగులు మృతి

ABOUT THE AUTHOR

...view details