తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదర్శ ప్రాయురాలు.. పోరాట కెరటం ఆకుల మల్లవ్వ

నిజామాబాద్​ జిల్లాలో ఇటీవలే ఓ వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం చేశారు ఆమె కుటుంబసభ్యులు. సీపీఐ (ఎంఎల్‌) ఆధ్వర్యంలో నేడు ఆమె సంతాపసభ జరిగింది.

By

Published : Jan 6, 2021, 6:38 PM IST

Under the auspices of the CPI (ML) in Nizamabad district center .. Aakula Mallavva mourning meeting was organized
'ఆదర్శప్రాయురాలు.. ఆకుల మల్లవ్వ'

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో సీపీఐ (ఎంఎల్‌) ఆధ్వర్యంలో.. ఆకుల మల్లవ్వ సంతాపసభను నిర్వహించారు. సీపీఐ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి డీవీ కృష్ణ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మల్లవ్వను అందరు ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు.

మరణానంతరం నేత్రాలు, శరీర దానంతో.. మల్లవ్వ సమాజానికి ఎంతో ఆదర్శంగా నిలిచారని కృష్ణ అన్నారు. ఇందూర్ కమ్యూనిస్టు ఉద్యమానికి ఆమె ఇల్లు ఒక అడ్డా అని అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో తన కుమారుడిని జైల్లో పెట్టినా.. ధైర్యంగా నిలబడి ఉద్యమానికి అండగా నిలిచారంటూ కొనియాడారు.

ఈ కార్యక్రమంలో.. మహబూబ్ నగర్ జిల్లా ఎస్వీఎస్ మెడికల్ కళాశాల ప్రతినిధులు, లయన్స్ క్లబ్​ బృందం సభ్యులు హాజరయ్యారు.

ఇదీ చదవండి:కంటతడి పెడుతూనే.. కొడుకు నేత్రాలు దానం

ABOUT THE AUTHOR

...view details