తెలంగాణ

telangana

By

Published : Mar 3, 2020, 2:45 PM IST

ETV Bharat / state

'వ్యవసాయంలో కొత్త విధానాలు అమలు చేయండి'

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయంలో కొత్త విధానాలు అమలుచేయాలని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచనలు చేశారు. వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.

speaker tour at varni mandal nizamabad district
'వ్యవసాయంలో కొత్త విధానాలు అమలు చేయండి'

నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమంలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. సహకార సంఘాలు రైతులకు కల్పవృక్షాలని పోచారం వ్యాఖ్యానించారు. రైతులే అధ్యక్షులుగా ఉంటూ సహకార సంఘాలు నిర్విహిస్తారు కాబట్టి రైతులకు ఎక్కువ మేలు జరుగుతుందని అన్నారు.

'వ్యవసాయంలో కొత్త విధానాలు అమలు చేయండి'

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయంలో కొత్త విధానాలు అమలుచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:అడవిని చదివిన 'తులసి'బామ్మకు పద్మశ్రీ

ABOUT THE AUTHOR

...view details