తెలంగాణ

telangana

By

Published : Nov 10, 2020, 9:50 PM IST

ETV Bharat / state

వీరజవాన్ల పార్థీవదేహాలకు ప్రముఖుల నివాళులు...

కశ్మీర్‌లో వీరమరణం పొందిన జవాన్‌ మహేశ్‌ పార్థీవదేహం స్వస్థలానికి చేరుకుంది. ముందుగా.. నిజామాబాద్​, చిత్తూరు జిల్లాలకు చెందిన ఇద్దరు జవాన్ల పార్థీవ దేహాలు హైదరాబాద్‌లోని బేగంపేట్‌ విమానాశ్రయానికి చేరుకున్నాయి. జవాన్ల భౌతికఖాయాలకు గవర్నర్‌ తమిళిసై, రోడ్లు, భవనాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్‌, నార్త్‌జోన్‌ డీసీపీ కమలేశ్వర్ నివాళులర్పించారు. అక్కడి నుంచి ప్రత్యేక అంబులెన్స్​లో నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లికి మహేశ్​ పార్థీవదేహాన్ని తన స్వస్థలానికి తరలించారు. చిత్తూరుకు చెందిన వీరజవాన్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పార్థివదేహాన్ని రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు.

స్వస్థలానికి చేరుకున్న వీరజవాన్ల పార్థీవదేహాలు...
స్వస్థలానికి చేరుకున్న వీరజవాన్ల పార్థీవదేహాలు...

స్వస్థలానికి చేరుకున్న వీరజవాన్ల పార్థీవదేహాలు...

ఇదీ చూడండి: వీర జవాన్ మహేశ్ అంత్యక్రియలకు ఏర్పాట్లు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details