తెలంగాణ

telangana

ETV Bharat / state

మనవడిని చంపినవాడు... జైలులో ఆత్మహత్య

గతవారం జీవిత ఖైదీగా శిక్ష పడిన వ్యక్తి సారంగాపూర్​ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మనవడిని చంపిన కేసులో ఏడాదిన్నరగా శిక్ష అనుభవిస్తున్నాడు.

By

Published : Jul 17, 2019, 3:36 PM IST

జైల్లో ఉరివేసుకొని జీవిత ఖైదీ ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లాలోని సారంగాపూర్ జైల్లో వెంకట్ అనే ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. గతవారం జీవిత ఖైదీ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. మనస్థాపం చెందిన వెంకట్​ బాత్​రూంలో ఉరివేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అరగొండకు చెందిన వడ్ల వెంకట్ ఏడాదిన్నర క్రితం తన కుమారుడి కొడుకుని చంపాడు. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. కేసు సమగ్ర విచారణ చేసి జీవితఖైదు విధించింది. తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

జైల్లో ఉరివేసుకొని జీవిత ఖైదీ ఆత్మహత్య

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details