తెలంగాణ

telangana

By

Published : Aug 1, 2020, 11:00 PM IST

ETV Bharat / state

మొక్కలు నాటిన మెగాస్టార్​ చిరంజీవి అభిమానులు

ఈ నెల 22న హీరో చిరంజీవి జన్మదినం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిజామాబాద్​ జిల్లా బోధన్​ మండలం హున్సలో అభిమాన నాయకులు మొక్కలు నాటారు. బర్త్​డే వరకు మొక్కలు నాటడమే కాకుండా మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేస్తామని తెలిపారు.

plantation program in nizamabad by ciranjeevi fans
మొక్కలు నాటిన మెగాస్టార్​ చిరంజీవి అభిమానులు

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్స గ్రామంలో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మొక్కలు నాటారు. ఈ నెల 22న తమ అభిమాన హీరో చిరంజీవి జన్మదినం సందర్భంగా ఆరోజు వరకు మొక్కలు నాటుతామని అభిమాన నాయకులు తెలిపారు.

ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టడానికి మారుమూల గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. మాస్కులు, శానిటైజర్లు అందిస్తామన్నారు. చిరంజీవి కోరిక మేరకు ఈ కార్యక్రమాలు చేపట్టామని అల్ ఇండియా చిరంజీవి ఫాన్స్ అసోసియేషన్ మెంబర్ క్రాంతి కుమార్ తెలిపారు.

ఇదీ చదవండి:ఆగస్టు, సెప్టెంబర్​ నెలల్లో మరింతగా కరోనా విజృంభణ: ఈటల

ABOUT THE AUTHOR

...view details