తెలంగాణ

telangana

కఠిన నిర్ణయాలు అమలు చేస్తాం: మున్సిపల్ కమిషనర్

వచ్చే సోమవారం నుంచి కఠిన నిర్ణయాలు అమలు చేయనున్నట్లు నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని సూచించారు.

By

Published : Apr 11, 2020, 3:29 PM IST

Published : Apr 11, 2020, 3:29 PM IST

ETV Bharat / state

కఠిన నిర్ణయాలు అమలు చేస్తాం: మున్సిపల్ కమిషనర్

'కఠిన నిర్ణయాలు అమలు చేస్తాం'
'కఠిన నిర్ణయాలు అమలు చేస్తాం'

కరోనా వైరస్ ప్రభావిత ప్రాంతాలను రెడ్ ​జోన్​గా ప్రకటించామని, ఆ ప్రాంతాల నుంచి ఎవరూ బయటకు రాకూడదని కోరారు నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ జితేశ్​ వీ పాటిల్. వచ్చే సోమవారం నుంచి కఠిన నిర్ణయాలు అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దుకాణ సముదాయాలు తెరిచి ఉంచాలని ఆదేశించారు. ఒంటి గంట తర్వాత రోడ్లపై రాకూడదని, అత్యవసరమైతేనే బయటికి రావాలని విజ్ఞప్తి చేశారు. మాస్కు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details