తెలంగాణ

telangana

ETV Bharat / state

'అధికార దురహంకారంతో తిడితే ఊరుకోవాలా?'

మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తున్న జవాన్​ను, కమిషనర్​ దుర్భాషలాడి, అమర్యాదగా ప్రవర్తించిన తీరుపై నిరసనగా కార్మికులు ఆందోళనకు దిగారు. అతనిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

By

Published : May 14, 2019, 5:18 PM IST

Updated : May 17, 2019, 5:28 PM IST

మున్సిపల్ కార్మికుల ధర్నా

నిజామాబాద్ జిల్లా బోధన్​లో మున్సిపాలిటీ కార్యాలయం ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. మున్సిపాల్​ కమిషనర్ జవాన్​గా పనిచేస్తున్న గంగాధర్ అనే వ్యక్తిని దుర్భాషాలాడారనే ఆరోపణతో సహద్యోగులతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ రోజు ఉదయం 7:30 గంటలకు కమిషనర్ అసభ్యకరంగా తిడుతూ, అమర్యాదగా ప్రవర్తించాడని ధర్నా నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ వచ్చి కార్మికులకు నచ్చచెప్పారు. దీంతో వారు ఆందోళన విరమించారు. కమిషనర్​ను సస్పెండ్ చేయాలంటూ వినతి పత్రం అందించారు.

మున్సిపల్ కార్మికుల ధర్నా
Last Updated : May 17, 2019, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details