తెలంగాణ

telangana

ETV Bharat / state

డిచ్​పల్లిలో వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లిలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నారు.

By

Published : Oct 11, 2019, 8:31 PM IST

డిచ్​పల్లిలో ఘనంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

డిచ్​పల్లిలో ఘనంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లిలోని ఏడవ బెటాలియన్​లో శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కమాండెంట్ సాంబయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మేళతాళాల నడుమ శ్రీ అలివేలు మంగ సమేత శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి కల్యాణం కన్నులపండువగా సాగింది. ఆలయ అర్చకులు ఉత్సవ మూర్తులకు అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మోత్సవాలు ఈ నెల 14 వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్ సత్య శ్రీనివాస్, అసిస్టెంట్ కమాండెంట్ సీతారాం, రమణ, బెటాలియన్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details