తెలంగాణ

telangana

By

Published : Feb 13, 2020, 4:59 PM IST

ETV Bharat / state

మాజీ ఎంపీ నారాయణ రెడ్డి సంస్మరణ సభ

నిజామాబాద్​ జిల్లా బృందావనం గార్డెన్​లో మాజీ ఎంపీ ఎం.నారాయణ రెడ్డి సంస్మరణ సభ జరిగింది. పలువులు రాజకీయ ప్రముఖులు, సాహితీవేత్తలు హాజరై నారాయణరెడ్డి చిత్రపటానికి నివాళి అర్పించారు.

former mp mnarayana reddy
మాజీ ఎంపీ నారాయణ రెడ్డి సంస్మరణ సభ

పార్లమెంట్​ మాజీ సభ్యుడు ఎం.నారయణరెడ్డి సంస్మరణ సభను నిజామాబాద్​ పట్టణంలోని బృందావనం గార్డెన్స్​లో ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి, ఎమ్మెల్యే గణేష్​ గుప్తా, మాజీ ఎంపీ వినోద్​ కుమార్​, మాజీ మంత్రులు సంతోష్​ రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సిరెడ్డి తదితరులు... ఇతర సాహితీ ప్రముఖులు పాల్గొని నారాయణ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. విద్య, మహిళల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని పలువురు వక్తలు గుర్తుచేశారు.

మాజీ ఎంపీ నారాయణ రెడ్డి సంస్మరణ సభ

ఇదీ చూడండి: రంగెలిసిన నేతన్న బతుకు సప్తవర్ణమెలా అయ్యిందంటే...

ABOUT THE AUTHOR

...view details