తెలంగాణ

telangana

ETV Bharat / state

చేపలకు పెరిగిన గిరాకీ

మృగశిర కార్తెలో చేపలు తింటే మంచిదనే భావనతో జనాలు చేపల కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. నిజామాబాద్​ జిల్లా ఇందల్వాయి చెరువులో మత్స్యకారులు చేపలు పట్టి విక్రయించారు. మత్స్యాలను కొనడానికి నియోగదారులు బారులు తీరారు.

By

Published : Jun 9, 2019, 12:58 PM IST

మత్స్యకారులు

నిజామాబాద్​ జిల్లా ఇందల్వాయి చెరువులో మత్య్సకారులు చేపలు పట్టి విక్రయించారు. మృగశిర కార్తె కావడం వల్ల చేపలు కొనడానకి జనాలు బారులు తీరారు. కార్తె శనివారమే ప్రారంభమైనప్పటికీ నిన్న నీచు తినని కారణంగా ఈ రోజు చేపలు తినడానికి ఆసక్తి చూపారు. మీనాల ఎదుగుదల సరిగా లేదని, దిగుబడి గణనీయంగా తగ్గిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిలో ఈ ఒక్కరోజే చేపలకు విపరీతంగా డిమాండు ఉంటుందని, విత్తనం సరిగ్గా లేకపోవడమే దిగుబడి తగ్గడానికి కారణమని తెలుస్తోంది.

చేపలకు పెరిగిన గిరాకీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details