తెలంగాణ

telangana

By

Published : Sep 22, 2019, 11:09 PM IST

ETV Bharat / state

'ఎస్​బీఐ బ్యాంకులో చోరీకి విఫలయత్నం'

అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బ్యాంకులో చోరీకి దిగిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

బ్యాంకు కిటికీ నుంచి లోపలకి చొరబడిన దుండగులు

నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. బ్యాంకు కిటికీ నుంచి లోపలకి చొరబడిన దుండగులు లాకర్​ను పగలగొట్టేందుకు విఫలయత్నం చేశారు. దొంగలు లోపలికి చొరబడగానే వెంటనే అలారం మోగడం వల్ల అక్కడి నుంచి దుండగులు పరారయ్యారు.
అప్రమత్తమైన బ్యాంకు అధికారులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. బ్యాంకు మేనేజర్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఘటనలో ఎటువంటి దోపిడీ జరగలేదని, సీసీ కెమెరాలు మాత్రమే ధ్వంసమయ్యాయని ఎస్సై నవీన్ కుమార్ వెల్లడించారు.

బ్యాంకు కిటికీ నుంచి లోపలకి చొరబడిన దుండగులు
ఇవీ చూడండి : సబ్​ప్లాన్​ నిధులపై అఖిలపక్షం ఏర్పాటు స్వాగతిస్తున్నాం : భట్టి

ABOUT THE AUTHOR

...view details