తెలంగాణ

telangana

ETV Bharat / state

'కొవిడ్ బాధితులకు ఆహార నియమాలు తప్పనిసరి'

కొవిడ్ సోకిన వారు కచ్చితంగా ఆహార నియమాలు పాటించాలని నిజామాబాద్​కు చెందిన ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్‌ ఆశిష్ రెడ్డి సూచించారు. కరోనా బారిన పడిన చాలామందిలో జీర్ణసంబంధ సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఈటీవీ భారత్ నిర్వహించిన ఫోన్ ఇన్‌ కార్యక్రమంలో ప్రజలు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

By

Published : May 14, 2021, 6:45 PM IST

ETV bharat phone in programme
ఈటీవీ భారత్ నిర్వహించిన ఫోన్ ఇన్‌ కార్యక్రమం

కొవిడ్ బారిన పడిన చాలా మంది జీర్ణ సంబంధ వ్యాధులతో బాధ పడుతున్నారని ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్‌ ఆశిష్ రెడ్డి తెలిపారు. కడుపులో మంట, మలబద్దకం, అజీర్తి, కడుపునొప్పి వంటి సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈటీవీ భారత్ ఫోన్ ఇన్‌లో ప్రజలు అడిగిన పలు ప్రశ్నలకు ఓపిగ్గా డాక్టర్‌ ఆశిష్ రెడ్డి సమాధానమిచ్చారు.

జీర్ణ సమస్యను అలాగే వదిలేయకుండా సరైన ఔషధాలు వాడుతూ జీవన విధానం, ఆహార నియమాల్లో మార్పులు చేసుకోవాలని సూచించారు. కొవిడ్ బాధితులు వీలైనంత వరకు మసాలా, ఆయిల్ ఉండే ఆహారం తీసుకోవడం తగ్గించాలని డాక్టర్‌ ఆశిష్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈటీవీ భారత్ నిర్వహించిన ఫోన్ ఇన్‌ కార్యక్రమం

ఇదీ చూడండి:రాష్ట్రంలో వ్యాక్సినేషన్​పై లాక్​డౌన్ ఎఫెక్ట్

ABOUT THE AUTHOR

...view details