తెలంగాణ

telangana

By

Published : Sep 15, 2020, 8:51 PM IST

ETV Bharat / state

పల్లె ప్రకృతి వనంలో కలెక్టర్ పర్యటన

నిజామాబాద్​ జిల్లాలోని మండలాల్లో కలెక్టర్​ పర్యటించారు. జడ్పీటీసీ సభ్యులతో కలిసి పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటారు.

Collector tour in the Nizamabad District
Collector tour in the Nizamabad District

నిజామాబాద్​ జిల్లా ధర్మపల్లి మండల కేంద్రంలో పల్లె ప్రకృతి వనంలో మంగళవారం జిల్లా కలెక్టర్​ నారాయణరెడ్డి, జడ్పీటీసీ సభ్యులు బాజిరెడ్డి జగన్​తో కలిసి మొక్కలు నాటారు. పల్లె ప్రకృతి వనంలో ఏర్పాటు చేసిన స్థలం ప్రజలకు అందుబాటులో ఉందని, మంచి మంచి మొక్కలు తీసుకువచ్చినందుకు పాలకవర్గాన్ని కలెక్టర్​ అభినందించారు. మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకొని నందనవనంగా చేయాలని, జిల్లాలోనే ప్రథమ స్థానంలో పల్లె ప్రకృతి వనాన్ని తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.

హరిత హారంలో నాటిన మొక్కలు రోడ్డుకిరువైపులా చాలా బాగున్నాయని, అలాగే ఇంకా ఎక్కడైనా రోడ్డు పక్కన మొక్కలు లేకుంటే 5 మీటర్లకు ఒక మొక్కను నాటి వాటిని సంరక్షణ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రైతు భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు తొందరగా పూర్తి చేసి రైతు వేదికను రైతులకు అందుబాటులోకి తేవాలని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details