తెలంగాణ

telangana

ETV Bharat / state

కుటుంబ గొడవలతో సెల్ టవర్ ఎక్కిన భర్త

కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కాడు. స్థానికులు, పోలీసులు, కుటుంబ సభ్యులందరూ బతిమాలినా వినలేదు.

By

Published : Aug 18, 2019, 6:46 PM IST

కుటుంబ గొడవలతో సెల్ టవర్ ఎక్కిన భర్త

నిజామాబాద్ జిల్లా రుద్రూర్​లో గైని లక్ష్మణ్ అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కాడు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండగా ఇటీవల పెద్దలు సర్ది చెప్పారు. అయినా గొడవలు జరుగుతున్నాయని భార్య అర్చన పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మాట్లాడేందుకు లక్ష్మణ్​ను స్టేషన్​కు పిలిపించారు. అయితే చర్చల సమయంలోనే లక్ష్మణ్ పక్కనే ఉన్న సెల్ టవర్ ఎక్కాడు. స్థానికులు, పోలీసులు, కుటుంబ సభ్యులందరూ బతిమాలినా వినలేదు. దాదాపు గంటన్నర తర్వాత టవర్ నుంచి దిగాడు. భార్యభర్తలకు పోలీసులు నచ్చజెప్పి పంపించారు.

కుటుంబ గొడవలతో సెల్ టవర్ ఎక్కిన భర్త

ABOUT THE AUTHOR

...view details