విధ్వంసాలు సృష్టిస్తే కఠిన శిక్షలు: బోధన్ ఏసీపీ ఆర్టీసీ సమ్మెనుద్దేశించి నిజామాబాద్ జిల్లా బోధన్ ఏసీపీ రఘు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు కార్మికులు నష్టం కలిగించకుండా సమ్మెలో పాల్గొనాలని ఆయన సూచించారు. ఎవరైనా ఏమైనా విధ్వంసాలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయన్నారు. తాత్కాలిక డ్రైవర్ల విధులకు ఆటంకం కలిగిస్తే నేరంగా పరిగణించబడుతుందని ఏసీపీ రఘు హెచ్చరించారు.