తెలంగాణ

telangana

ETV Bharat / state

అన్ని కళాశాలల్లో బయోమెట్రిక్

విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. బయోమెట్రిక్ హాజరు నమోదు చేయని కళాశాలలపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

By

Published : Jun 30, 2019, 3:17 PM IST

అన్ని కళాశాలల్లో బయోమెట్రిక్:తెవివి

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని కళాశాలల్లో 2019-2020 విద్యా సంవత్సరం నుంచి తప్పనిసరిగా బయోమెట్రిక్‌ హాజరు ప్రవేశ పెట్టనున్నారు. ఇందుకోసం శనివారం హైదరాబాద్‌లో ఉన్నత విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షుడు ఆచార్య లింబాద్రి ఆధ్వర్యంలో టీఎస్‌టీఎస్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈ సందర్భంగా వర్సిటీ రిజిస్ట్రార్‌ బలరాములు, టీఎస్‌టీఎస్‌ సంస్థ అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి చేసినట్లు కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ తెలిపారు. బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేయని కళాశాలలపై చర్యలు ఉంటాయని, విద్యార్థుల పరీక్ష ఫీజును కూడా అనుమతించబోమని స్పష్టం చేశారు.

దోస్త్‌లో భాగంగా మూడో విడతలో సీట్లు పొందిన విద్యార్థులు జులై మొదటి నుంచి కళాశాలల్లో రిపోర్టు చేయాలని దోస్త్‌ కన్వీనర్‌ ఆచార్య లింబాద్రి పేర్కొన్నారు. ఇంటర్‌ ఇంఫ్రూవ్‌మెంట్‌ ఫలితాల తర్వాత ఇంకో దశ దోస్త్‌ ప్రక్రియ ఉంటుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో తెవివి అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చూడండి:అర్జున్ రెడ్డి దర్శకుడికి అదిరే ఆఫర్..!

ABOUT THE AUTHOR

...view details