నిర్మల్ జిల్లా కేంద్రంలో లాక్డౌన్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు వినూత్న ప్రచారం చేశారు. ఉదయం పూట ఇస్తున్నసడలింపు వల్ల వాహనాలపై జనం విచ్చలవిడిగా రోడ్డెక్కుతున్న నేపథ్యంలో పట్టణంలోని శివాజీచౌక్లో కళాజాత బృందంతో ప్రదర్శన నిర్వహించారు.
లాక్డౌన్పై పోలీసుల కళా జాత ప్రదర్శన
లాక్డౌన్ వేళ నిబంధనలు పాటించని వారి కోసం పోలీసులు.. కళా జాత ప్రదర్శనతో అవగాహన కల్పించారు. అత్యవసరముంటే తప్ప రోడ్ల మీదికి ఎవరూ రావొద్దని కోరారు. కరోనా కట్టడి కోసం పోలీసులు తీసుకుంటున్న జాగ్రత్తలపై కళాకారులు ప్రదర్శన ఇచ్చారు.
లాక్డౌన్పై పోలీసుల కళాజాత ప్రదర్శన
ప్రజలు రహదారిపైకి వస్తే కరోనా వైరస్ సోకుతుందని... అలా జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు. అత్యవసర సమయంలోనే ప్రజలు బయటకు వెళ్లాలని, భౌతికదూరం పాటించాలని తెలిపారు. కరోనా వైరస్పై పోలీసులు తీసుకుంటున్న జాగ్రత్తలను ప్రదర్శించారు. ప్రజలంతా ప్రభుత్వ సూచనలు పాటిస్తూ అధికారులకు సహకరించాలని కోరారు.