తెలంగాణ

telangana

By

Published : Feb 11, 2021, 4:18 PM IST

ETV Bharat / state

'హెల్మెట్​తో పాటు.. లైసెన్స్, ఆర్సీలు తప్పనిసరి'

32వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్​ నియమాలను పాటించాలని సూచించారు.

Police conducted awareness drive for motorists in Nirmal district center
'హెల్మెట్​తో పాటు.. లైసెన్స్, ఆర్సీలు తప్పనిసరి'

ద్విచక్ర వాహనదారులు.. ట్రాఫిక్ సిగ్నల్స్​​పై అవగాహన కలిగి ఉండాలని నిర్మల్ పట్టణ సీఐ శ్రీనివాస్ పేర్కొన్నారు. 32వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ప్రొ. జయశంకర్ చౌరస్తాలో వాహనదారులకు అవగాహన కల్పించారు.

ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలను తప్పక పాటించాలని సీఐ పేర్కొన్నారు. హెల్మెట్ ధరిస్తూ.. లైసెన్స్, ఆర్సీలను కలిగి ఉండాలని సూచించారు. నిబంధనలు పాటించిన వాహనదారులుకు చాక్లెట్లు అందజేశారు.

ఇదీ చదవండి:లారీ ఢీకొని ఐదేళ్ల పాప మృతి

ABOUT THE AUTHOR

...view details