తెలంగాణ

telangana

By

Published : Apr 25, 2020, 7:38 PM IST

ETV Bharat / state

పరిమళించిన మానవత్వం... హిందూ మహిళకు ముస్లిం అంత్యక్రియలు

అసలే లాక్​డౌన్​... అందులో నిరుపేద కుటుంబం... బిక్షాటన చేస్తూ ఆ వృద్ధ జంట జీవనం సాగిస్తున్నారు. ఎండ వేడికి వృద్ధురాలు ఆకస్మికంగా తనువు చాలించింది. ఎవరూ పట్టించుకోకపోవటంతో పట్టణంలోని ముస్లిం యువకులు ముందుకొచ్చారు. హిందూ సంప్రాదాయంలో దహన సంస్కారాలు నిర్వహించి... మానవత్వం చాటుకున్నారు.

MUSLIM YOUTH DONE CREMATION TO HINDU OLD AGE WOMEN
పరిమళించిన మానవత్వం... హిందూ మహిళకు ముస్లిం అంత్యక్రియలు

హిందూ, ముస్లిం భాయీభాయీ అనే పదాన్ని నిజం చేసి చూపించారు... నిర్మల్​లోని సహారా యూత్ యువకులు. బిక్షాటన చేస్తూ... జీవనం సాగించే ఓ హిందూ మహిళ మృతదేహానికి ముస్లింలు దగ్గరుండి దహన సంస్కారాలు నిర్వహించి మానవత్వాన్ని చాటారు.

నిర్మల్​లోని గాజులపేట్​లో కిషన్​రాజ్ గోండ్, ఎల్లమ్మ దంపతులు ఓ పూరిగుడిసెలో ఉంటూ బిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గతేడాది క్రితం ప్రమాదం జరగ్గా వైద్యులు ఎల్లమ్మ కాలును తొలగించారు. అప్పటి నుంచి వృద్ధురాలు గుడిసెలోనే ఉంటోంది.

ఎక్కడికక్కడా లాక్​డౌన్ కొనసాగటం వల్ల ఎల్లమ్మను గమనించిన గాజులపేట్​కు చెందిన ముస్లిం యువకులు, సహారా యూత్ సభ్యులు రెండు పూటలా భోజనం అందించారు. ఎండ వేడికి తాళలేక ఎల్లమ్మ మృతిచెందింది. కరోనా వైరస్‌ కారణంగా దహన సంస్కారాలకు ఎవరూ ముందుకు రాకపోవటం వల్ల... స్థానిక కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్లాహను హోంగార్డు అజహార్ సంప్రదించారు. వెంటనే సహారా యూత్ సభ్యులు మానవతా దృక్పథంతో స్పందించి వారి స్వంత ఖర్చుల‌తో హిందూ సంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. కిషన్​రాజ్ గోండ్​ను సహారా యూత్ తరఫున ఆదుకుంటామని తెలిపారు.

ఇదీ చదవండి:కరోనాపై పోలీసుల ప్రాంక్​.. వీడియో వైరల్

ABOUT THE AUTHOR

...view details