తెలంగాణ

telangana

ETV Bharat / state

కాళ్లరిగేలా తిరిగినా కనికరించరేమి అంటున్న రైతులు

గుంట భూమి ఉన్నా చిరిగిపోని పట్టాదారు పాస్​పుస్తకం ఇస్తాం. ఏడాదిలో రెండు పంటలకు పెట్టుబడి సాయం అందిస్తాం. రైతు కుటుంబానికి ఆసరాగా రైతుబీమా కల్పిస్తాం. ఇవి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ అసెంబ్లీలో చెప్పిన మాటలు. రాజధానిలో సీఎం ఆలోచనలు ఇలా ఉంటే క్షేత్రస్థాయిలో అధికారుల తీరు ఇందుకు భిన్నంగా ఉంది.  అన్నదాతలను కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారు. పాస్​బుక్​లు ఇవ్వకుండా ఆవేదనకు గురి చేస్తున్నారు.

By

Published : Mar 30, 2019, 12:09 AM IST

Updated : Mar 30, 2019, 7:48 AM IST

రెవెన్యూ శాఖ కార్యాలయం

కాల్లారిగేలా తిరిగినా కనికరించరేమి అంటున్న రైతుల
ఈ రోజు వస్తే రేపు రమ్మంటున్నారు. రేపు వస్తే ఎల్లుండి రమ్మంటున్నారు. ఎల్లుండి వెళ్తే సార్​ లేడు అంటున్నారు. ఇలా సంవత్సరాలు గడుపుతూ దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆవేదనకు గురి చేస్తున్నారు రెవెన్యూ శాఖ అధికారులు. రెవెన్యూ సిబ్బంది తప్పిదాలతో కొత్త పాస్​ పుస్తకాలు అందుకోలేక, రైతుబంధుకు నోచుకోలేక, రైతుబీమాకు దరఖాస్తు చేసుకోలేక నిర్మల్​ జిల్లా లోకేశ్వరం మండలంలోని వందలాది అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.


ఒక్క పైసా కూడా రాలేదు

లక్ష్మణ్ అనే రైతుకు వారసత్వంగా 3.15 ఎకరాల భూమి వచ్చింది. పెట్టుబడి సాయం ఒక్క పైసా కూడా రాలేదని చెబుతున్నాడు. అధికారుల చుట్టు తిరిగినా కొత్త పాస్​ పుస్తకాలు ఇవ్వలేదని ​ ఆవేదన వ్యక్తం చేశాడు. చిన్నకారు రైతులను ఇలా చేయడం సరైంది కాదన్నాడు.

ఒకే సర్వే నంబర్​ అయినా

పుస్పూర్ గ్రామానికి చెందిన వీరేశ్​కు 6.02 ఎకరాల భూమి ఉంది. ఇదే సర్వే నంబరు​లో ఉన్న అమ్మకు, అన్నకు రైతు బంధు డబ్బులు వచ్చాయని తనకేమో రాలేదని వాపోయాడు. అధికారుల వద్దకు ఎన్నిసార్లు వెళ్లినా పట్టించుకోలేదన్నాడు. చాలా మంది అన్నదాతల పరిస్థితి ఇదే విధంగా ఉంది.

త్వరలో మిగిలిన వారికి

లోకేశ్వరం తహసీల్దార్ శ్రీదేవిని వివరణ కోరగా తను లోకేశ్వరానికి ఎన్నికల విధుల కోసం బదిలీపై వచ్చానని తెలిపారు. ఈ ఎన్నికల హడావుడిలో ఉన్నామని ఇప్పటికే 700 మంది రైతులకు పట్టాదారు పాస్​ పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. మిగిలిన వారికి త్వరలో అందజేస్తామని వెల్లడించారు.

అధికారులు వీలైనంత త్వరగా తమకు పట్టాదారు పాస్​ పుస్తకాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.
ఇవీ చూడండి:'ఓటు స్లిప్పుల లెక్కపై మా పద్ధతే ఉత్తమం'

Last Updated : Mar 30, 2019, 7:48 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details