తెలంగాణ

telangana

శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శ్రీ శారదీయ శరన్నవరాత్రి మహోత్సవాల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

By

Published : Oct 21, 2020, 11:41 AM IST

Published : Oct 21, 2020, 11:41 AM IST

endowment minister indrakaran reddy special pooja in basara
శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి

నిర్మల్​ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శ్రీ శారదీయ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు స్కందమాత అవతారంలో దర్శనమిచ్చారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి కుటుంబసమేతంగా హాజరై... అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు.

వేడుకలకు హజరైన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముథోల్​ ఎమ్మెల్యే విఠల్​ రెడ్డికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వగతం పలికారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణతో ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు అందించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించున్నట్టు తెలిపారు. ఆలయాల అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్​ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:నిరంతరం విధి నిర్వహణలో పోలీసులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details