తెలంగాణ

telangana

ETV Bharat / state

కచ్చితమైన వేతనాలు చెల్లించాలని ఆశాల ఆందోళన

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టరేట్​ ముందు ఆశా కార్యకర్తలు ఆందోళన చేశారు.​

By

Published : Sep 23, 2019, 7:34 PM IST

ఆశాల ఆందోళన

కచ్చితమైన వేతనం రూ.10వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ... సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పెండింగులో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. తమకు సంబంధం లేని పనులు చేయిస్తూ.. పారితోషకం ఇస్తామని కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్​లో చెల్లిస్తున్నట్లే తమక్కూడా.. వేతనాలు పెంచాలని కోరారు.

ఆశాల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details