రైతులు పండించిన కూరగాయలు గిట్టుబాటు ధరకు స్వయంగా విక్రయించేందుకే జిల్లాలో రైతు బజార్ ఏర్పాటు చేశామని నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన అన్నారు. దళారుల చేతిలో మోసపోవద్దని సూచించారు.
'గిట్టుబాటు ధర రావాలంటే రైతు బజార్లోనే విక్రయించాలి'
నారాయణపేట జిల్లా రైతులు.. వారు పండించిన కూరగాయలను స్వయంగా విక్రయించేందుకు మొగ్గు చూపాలని కలెక్టర్ హరిచందన సూచించారు. రైతు బజార్ సముదాయం, ప్రభుత్వాసుపత్రిని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ హరిచందన ఆకస్మిక తనిఖీ చేశారు.
నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన ఆకస్మిక తనిఖీ
ఎమ్మెల్యే రాజేందర్రెడ్డితో కలిసి రైతు బజార్ సముదాయం, ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ హరిచందన ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నారో లేదో ఆరా తీశారు.
- ఇదీ చూడండి..తండాలో అగ్నిప్రమాదం... భారీ ఆస్తినష్టం