తెలంగాణ

telangana

ETV Bharat / state

వైద్యం వికటించి యువతి మృతి.. బంధువుల ఆందోళన

వైద్యం వికటించి మృతి చెందిన ధీరావత్ సంధ్య మృతదేహంతో టీక్యా తండావాసులు బంధువులు శనివారం సాయంత్రం మిర్యాలగూడలోని సాగర్​ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. నిర్లక్ష్యంగా ఆపరేషన్​ చేసిన వైద్యుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్​ చేశారు.

By

Published : Jun 22, 2019, 11:10 PM IST

వైద్యం వికటించి యువతి మృతి.. బంధువుల ఆందోళన

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలోని వంశీకృష్ణ ఆస్పత్రిలో ఆపరేషన్ వికటించి నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడి ధీరావత్ సంధ్య అనే ఇంటర్మీడియట్ విద్యార్థిని మృతి చెందింది. మిర్యాలగూడ మండలం టీక్యా తండాకు చెందిన ధీరావత్ నిలేశ్వర్ నాయక్ కుమార్తె సంధ్య పట్టణంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతోంది. బాలిక కొద్ది రోజులుగా గవద బిల్లల సమస్యతో బాధపడుతుండటం వల్ల ఈ నెల 19న పట్టణంలోని డాక్టర్స్ కాలనీ వంశీకృష్ణ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యుడు వంశీకృష్ణ ఆపరేషన్ చేస్తుండగానే మధ్యలో సంధ్య అపస్మారక స్థితిలోకి వెళ్లగా ఆపరేషన్ నిలిపివేసి అత్యవసర వైద్యం కోసం పట్టణంలోని బాలాజీ ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్​పై ఉంచి చికిత్స చేసినప్పటికీ ప్రయోజనం లేకపోగా 20న హైదరాబాద్​లోని యశోదా ఆసుపత్రికి తరలించారు నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడిన సంధ్య శనివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. హైదరాబాద్ నుంచి ఆంబులెన్స్​లో సంధ్య మృతదేహాన్ని తీసుకు రాగా.. సంధ్య బంధువులు సాగర్ రోడ్డుపై​ రాస్తారోకో చేపట్టారు. వంశీకృష్ణ ఆస్పత్రిని సీజ్ చేసి నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేసిన వైద్యుడిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

వైద్యం వికటించి యువతి మృతి.. బంధువుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details