తెలంగాణ

telangana

ETV Bharat / state

గాంధీసాగర్​ ప్రాజెక్టు మరమ్మతులు ఎప్పుడో? - gandhi sagar

దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించని చందంగా మారింది నల్గొండ జిల్లా గాంధీసాగర్​ ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పరిస్థితి. ప్రాజెక్టు మరమ్మతులతోపాటు సోలిపురం రహదారి కోసం గత ఏడాది 9.97 కోట్లు నిధులు మజూరైనా పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పటికైనా టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టాలని రైతులు కోరుతున్నారు.

గాంధీసాగర్​ ప్రాజెక్టు

By

Published : Jun 30, 2019, 11:11 PM IST

గాంధీసాగర్​ ప్రాజెక్టు మరమ్మతులు ఎప్పుడో?

నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని గాంధీ సాగర్ ప్రాజెక్టు కింద దాదాపు 1650 ఎకరాల ఆయకట్టు ఉంది. కాలక్రమంలో ప్రాజెక్టు మట్టితో పుడుకుపోయింది. అన్నదాతల విన్నపంతో ప్రాజెక్టు మరమ్మతుల కోసం ప్రభుత్వ గత ఏడాది జూన్​లో 9.9 7కోట్ల నిధులు మంజూరు చేసింది.

నిధులు కేటాయించినా

ప్రభుత్వం నిధులు కేటాయించినా పనులు ప్రారంభించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. అప్పట్లోనే సాంకేతిక అనుమతుల కోసం అంటూ చిన్న నీటిపారుదల శాఖ అధికారులు హడావుడి చేసి ప్రాజెక్టును పరిశీలించి వెళ్లారు. కానీ ఇప్పటివరకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్ల పనులకు మోక్షం లభించలేదు. ప్రాజెక్టుకు పూర్వవైభవం వస్తుందని... రెండు పంటలు పండించుకునే అవకాశం ఉందని ఆశ పడ్డ అన్నదాతలకు నిరాశే మిగిలింది.

సోలిపురానికి దారేది

మునుగోడు నుంచి సోలిపురానికి వెళ్లాలంటే మార్గ మధ్యలో ఉన్న వాగు దాటి వెళ్లాల్సిందే. వానాకాలంలో వాగు దాటే పరిస్థితి లేదు. ఇలా ఎన్నో ఏళ్ల నుంచి అవస్థలు పడుతున్నారు. గత సంవత్సరం ప్రాజెక్టు మరమ్మతులో భాగంగా సోలిపురం రహదారికి కూడా నిధులు కేటాయించారు. కానీ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. వెంటనే టెండర్లు పిలిచి ప్రాజెక్టు మరమ్మతులతోపాటు సోలిపురం వెళ్లడానికి వాగుపై వంతెన నిర్మించాలని రైతులు కోరుతున్నారు.

ఇవీ చూడండి: నా తమ్ముడు దాడి చేయలేదు: ఎమ్మెల్యే కోనప్ప

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details