బడిలో పిల్లల హాజరు శాతాన్ని పెంచేందుకు నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు కొత్తగా ఆలోచించారు. ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై ఓ పాటను రూపొందించారు. విద్యార్థులు చక్కని అభినయంతో ఆ పాటను ఆలపిస్తూ.. ఒక్కొక్క కూరగాయను పరిచయం చేస్తుంటే... మనకూ ఓసారి మధ్యాహ్న భోజనాన్ని రుచి చూడాలనిపిస్తుంది కదూ..!
వివాహ భోజనంబు.. కాదు కాదు మధ్యాహ్న భోజనంబు..
మధ్యాహ్న భోజనంబు.. మజారే వంటకంబు.. సర్కారీ వారి విందు.. రావోయి బడికి ముందు.. అదేంటీ తెలిసిన పాటే కానీ.. కొంచెం కొత్తగా అనిపిస్తుంది కదూ.. దీని కథేంటో తెలియాలంటే నల్గొండ జిల్లా నేరడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్లాల్సిందే..
వివాహ భోజనంబు.. కాదు కాదు మధ్యాహ్న భోజనంబు..