తెలంగాణ

telangana

ETV Bharat / state

నాటు బాంబులతో దాడి.. ఇద్దరికి తీవ్రగాయాలు

రెండు ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు ఘర్షణ పడి రాళ్లు, నాటుబాంబులతో పరస్పరం దాడి చేసుకున్న ఘటన నల్గొండ జిల్లా నాయకుని తండాలో చోటుచేసుకుంది.

By

Published : Apr 16, 2019, 10:27 AM IST

నాటు బాంబులతో దాడి

నాటు బాంబులతో దాడి

నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం నాయకుని తండాలో ఆదివారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. రెండు ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు పరస్పరం ఇళ్లపై రాళ్లు విసురుకుంటూ, నాటు బాంబులతో దాడి చేసుకున్నారు. ఈ గొడవకు రెండు పార్టీల నాయకుల మధ్య జరిగిన స్వల్ప వాగ్వాదమే కారణమని తెలుస్తోంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనాలు, మూడు ఇళ్లను ధ్వంసం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని 144సెక్షన్​ విధించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details