తెలంగాణ

telangana

By

Published : Apr 3, 2019, 7:57 PM IST

ETV Bharat / state

'రాహుల్​ రఫెల్​ అంటే... మోదీ బోఫోర్స్​ అంటడు'

సమయం దగ్గరపడుతున్న కొద్దీ లోక్​సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. సభలు సమావేశాలతో పాటు రోడ్​షోలు నిర్వహించి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు నేతలు. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు మంత్రులు, సిట్టింగ్​ ఎంపీలు తీవ్రంగా కష్టపడుతున్నారు.

నాగార్జునసాగర్​ నియోజకవర్గంలో

రాష్ట్రంలో చేసిన అభివృద్ధి మాదిరిగానే దేశంలోనూ చేసేందుకు ముఖ్యమంత్రి పూనుకున్నారని మంత్రి జగదీశ్​రెడ్డి వ్యాఖ్యానించారు. నాగార్జునసాగర్​ నియోజకవర్గంలో చేపట్టిన ప్రచారంలో భాగంగా పలు ప్రాంతాల్లో రోడ్​షోలు నిర్వహించారు. మంత్రి జగదీశ్​రెడ్డితోపాటు ఎంపీ గుత్తా సుఖేందర్​రెడ్డి, ఎంపీ అభ్యర్థి నర్సింహారెడ్డి పాల్గొన్నారు. రోజూ... రాహుల్​, మోదీకి విమర్శలు చేసుకోవటం తప్ప ప్రజల సమస్యలు పట్టవని మంత్రి విమర్శించారు. పార్లమెంట్​ ఎన్నికల్లో రాష్ట్రంలోని 16 స్థానాలు కీలకం కానున్నాయని ఎంపీ గుత్తా సుఖేందర్​రెడ్డి తెలిపారు.

నాగార్జునసాగర్​ నియోజకవర్గంలో

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details