నల్గొండ జిల్లా దారమచర్ల మండలం వాడపల్లి చెక్పోస్ట్ వద్ద లాక్డౌన్ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉదయం 10 గంటల తర్వాత నుంచి లాక్డౌన్ అమలవుతుండగా.. ఏపీలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత లాక్డౌన్ ఉంది.
వాడపల్లి చెక్పోస్ట్ వద్ద పకడ్బందీగా లాక్డౌన్
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి చెక్పోస్ట్ వద్ద లాక్డౌన్ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఏపీ నుంచి అత్యవసరంగా వచ్చే వాహనదారుల వద్ద అనుమతి పత్రాలు ఉంటేనే రాష్ట్రంలోని అనుమతిస్తున్నారు.
![వాడపల్లి చెక్పోస్ట్ వద్ద పకడ్బందీగా లాక్డౌన్ vadapalli check post, lock down in nalgonda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11754692-1085-11754692-1620970550289.jpg)
వాడపల్లి చెక్పోస్ట్, నల్గొండలో లాక్డౌన్
ఈ క్రమంలో ఏపీ నుంచి రాష్ట్రానికి చాలా వాహనాలు వస్తుండటం వల్ల చెక్పోస్ట్ వద్ద రద్దీ కనపడుతోంది. అత్యవసరంగా రాష్ట్రానికి వచ్చే వాహనదారుల వద్ద అనుమతి పత్రాలుంటేనే తెలంగాణలోనికి పోలీసులు అనుమతిస్తున్నారు.
- ఇదీ చదవండి :రాష్ట్ర సరిహద్దులో ఏపీ అంబులెన్స్ల నిలిపివేత