తెలంగాణ

telangana

ఏడాదిన్నరలోగా పూర్తి చేయకపోతే రాజీనామా చేస్తా: జగదీశ్​ రెడ్డి

సీఎం కేసీఆర్​ శంకుస్థాపన చేసిన నెల్లికల్​ ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిన్నరలోగా పూర్తి చేయకపోతే రాజీనామా చేస్తానని రాష్ట్ర విద్యుత్​శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్​ నాయకులు అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్​ పాలనలో జానారెడ్డి చేసిన అభివద్ధి ఏమి లేదని విమర్శించారు.

By

Published : Apr 13, 2021, 11:28 AM IST

Published : Apr 13, 2021, 11:28 AM IST

minister Jagadish reddy clarified huis resignation on  on nellikal project
నెల్లికల్​ ప్రాజెక్ట్​పై మంత్రి జగదీశ్​ రెడ్డి

నెల్లికల్​ ఎత్తిపోతల పథకంపై తన మాటకు కట్టుబడి ఉన్నానని నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఇంఛార్జి, మంత్రి జగదీశ్ రెడ్డి మరోసారి తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు ఏడాదిన్నరలోగా పూర్తికాకపోతే తప్పకుండా రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. సాగర్​ ఉపఎన్నిక ప్రచారంలో చెప్పుకోవడానికి జానారెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు.

కాంగ్రెస్​ హయాంలో జానారెడ్డి పట్టించుకోకపోవడం వల్లే... తాము అక్కడి సమస్యలపై దృష్టిసారించామని తెలిపారు. వాళ్లు అభివృద్ధి చేస్తే గత ఎన్నికల్లోనే విజయం సాధించేవారని వ్యాఖ్యానించారు. 2018లో నెల్లికల్ ఎత్తిపోతలపై హామీ ఇచ్చామన్న మంత్రి... ఆ మాట ప్రకారమే ముఖ్యమంత్రి కేసీఆర్​ భూమి పూజ చేశారని గుర్తు చేశారు. ప్రాజెక్టు విషయంలో రాజీపడేది లేదన్న మంత్రి... రాజీనామా చేస్తానన్న మాటకు తగ్గేది లేదన్నారు.

రాష్ట్ర విద్యుత్​శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పూర్తిగా ఆత్మరక్షణలో పడింది. వారు అసత్యాలు ప్రచారం చేయడానికే పరిమితమయ్యారు. సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన నెల్లికల్ ఎత్తిపోతలపై కాంగ్రెస్​ నేతలు అసత్యాలు చెబుతున్నారు. ఏడాదిన్నరలోగా ప్రాజెక్టు పూర్తి కాకపోతే తన పదవికి రాజీనామా చేస్తా. కాంగ్రెస్​ అధికారంలో ఉన్నప్పుడు జానారెడ్డి ఏం చేశారు. ఇక్కడ లిఫ్ట్​ ప్రారంభించాలని ముఖ్యమంత్రికి ఆయన ఏనాడైనా లేఖ రాశారా?

-జగదీశ్​ రెడ్డి, విద్యుత్​శాఖ మంత్రి

ఇదీ చూడండి:జగిత్యాల జిల్లాలో ఒక్కరోజే 546 కరోనా పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details