తెలంగాణ

telangana

ETV Bharat / state

మునుగోడు అభివృద్ధే ఏకైక లక్ష్యం: రాజగోపాల్ రెడ్డి

నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని పలు గ్రామాల్లో శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి పర్యటించారు.

By

Published : Oct 11, 2019, 11:56 PM IST

నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి పర్యటించారు. ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మునుగోడులోని జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం, అంబేడ్కర్​ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. కాంట్రాక్టర్లు ఈ భవనాలను మంచి నాణ్యతా ప్రమాణాలతో నిర్మించే విధంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని సూచించారు. నియోజక వర్గ అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details