తెలంగాణ

telangana

ETV Bharat / state

కల్వకుర్తిలో బాబా విగ్రహ ప్రతిష్ఠాపన

పండితుల వేద మంత్రాల నడుమ, భక్తి శ్రద్ధలతో శిరిడి సాయి విగ్రహాన్ని నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తిలో ప్రతిష్ఠాపించారు.

By

Published : Jun 6, 2019, 6:01 PM IST

బాబా విగ్రహ ప్రతిష్ఠాపన

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలో శిరిడిసాయి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో యజ్ఞాలు, యాగాలు నిర్వహించి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. జాతీయ బీసి కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి, కల్వకుర్తి సీఐ సురేందర్ రెడ్డి, ఎస్సై నరసింహులు, రాజకీయ ప్రముఖులు ఈ ఉత్సవానికి హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

బాబా విగ్రహ ప్రతిష్ఠాపన

ABOUT THE AUTHOR

...view details