తెలంగాణ

telangana

ETV Bharat / state

'గ్రామాల అభివృద్ధికి సమన్వయంతో కృషి చేయండి'

అధికారులు, ప్రజా ప్రతినిధులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. నాగర్ కర్నూల్ మండలంలో నూతనంగా ఎన్నుకోబడ్డ ఎంపీపీ చాంబర్​ను ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.

By

Published : Dec 28, 2020, 7:19 PM IST

Plenary Session in nagar Kurnool Zone
'గ్రామాల అభివృద్ధికి సమన్వయంతో కృషి చేయండి'

గ్రామాలను అభివృద్ధి పరిచేందుకు అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ మండలం సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథులుగా హాజరైన ఆయన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డితో కలిసి నూతనంగా ఎన్నుకోబడ్డ ఎంపీపీ చాంబర్​ను ప్రారంభించారు.

'గ్రామాల అభివృద్ధికి సమన్వయంతో కృషి చేయండి'

సర్వసభ్య సమావేశంలో..

వైద్య, విద్య, వ్యవసాయంతో పాటు విద్యుత్, ఇరిగేషన్ ఎజెండాలపై చర్చించారు. గ్రామాల్లో నెలకొన్న పలు సమస్యలపై సంబంధిత అధికారులను ప్రశ్నించారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పూర్తి సమాచారంతో సర్వసభ్య సమావేశానికి హాజరవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు.. స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:సురవరం అంటే గుర్తొచ్చేది గోల్కొండ పత్రిక : మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details