తెలంగాణ

telangana

By

Published : Sep 27, 2020, 4:47 PM IST

ETV Bharat / state

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సర్పంచ్​ను పరామర్శించిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వంగూరు మండలం రంగాపూర్ గ్రామ సర్పంచ్​ని నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పరామర్శించారు. ఆమె ఆరోగ్యంపై ఆరా తీశారు.

మహిళా సర్పంచ్​ను పరామర్శించిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
మహిళా సర్పంచ్​ను పరామర్శించిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం రంగాపూర్ గ్రామ సర్పంచ్​ని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పరామర్శించారు. ప్రజలు ఎన్నుకున్న ఆమెపై అధికారులు, రాజకీయనాయకులు ఒత్తిడి చేయడం దారుణమన్నారు.

ఉన్నత విద్య అభ్యసించిన ఆమెపై ఒత్తిడి తేవడం వల్లనే మానసికంగా కుంగిపోయి ఈ చర్యకు పాల్పడిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆయన వెంట యూటీఎఫ్​ నాయకులు, తదితరులు ఉన్నారు.

ఇదీ చూడండి:రాగల మూడ్రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

ABOUT THE AUTHOR

...view details