తెలంగాణ

telangana

By

Published : Oct 16, 2020, 9:37 PM IST

Updated : Oct 16, 2020, 10:45 PM IST

ETV Bharat / state

ఎల్లూరు సర్జ్​పూల్​ పంప్​హౌస్​లోకి చేరిన నీరు, మునిగిన మోటార్లు

మహాత్మగాంధీ ఎత్తిపోతల పథకం మోటర్లు నీటిలో మునిగాయి. పంపు వద్ద గోడల పగుళ్ల ద్వారా పంప్​హౌస్​లోకి నీరు చేరి మోటార్లు పూర్తిగా మునిగిపోయాయి. పాలమూరు రంగారెడ్డి పనుల వద్ద బ్లాస్టింగ్ చేయడం వల్లే పగుళ్లు వచ్చినట్లు కేఎల్ఐ సిబ్బంది చెబుతున్నారు.

mahathma gandhi lift irrigation moters in water
మహాత్మగాంధీ ఎత్తిపోతల పథకం మోటర్ల మునక

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద నిర్మించిన మహాత్మగాంధీ ఎత్తిపోతల పథకం మొదటి పంపు వద్ద గోడల పగుళ్ల ద్వారా పంప్​హౌస్​లోకి నీరు చేరి మోటార్లు పూర్తిగా మునిగిపోయాయి. నీరు రావడం వల్ల పంప్​హౌస్​లో పనిచేస్తున్న సిబ్బంది పరుగులు తీశారు.

ఎల్లూరు సర్జ్​పూల్​ పంప్​హౌస్​లోకి చేరిన నీరు, మునిగిన మోటార్లు

కృష్ణా నదిలో ప్రవాహం పెరగటంతో పాటు పాలమూరు-రంగారెడ్డి పనుల వద్ద బ్లాస్టింగ్ చేయడం వల్లే పగుళ్లు వచ్చినట్లు కేఎల్ఐ సిబ్బంది చెబుతున్నారు. గతంలోనూ పంప్​హౌస్ వద్ద లీకేజీతో మోటర్లు మునిగిపోయాయి.

ఇదీ చదవండి:రాష్ట్రంలో సందడిగా మొదలైన బతుకమ్మ వేడుకలు

Last Updated : Oct 16, 2020, 10:45 PM IST

ABOUT THE AUTHOR

...view details