తెలంగాణ

telangana

జిల్లాను సేఫ్​ జోన్​గా ఉంచాలి: కలెక్టర్​ శ్రీధర్

By

Published : Apr 24, 2020, 5:11 PM IST

కరోనా మహమ్మారి కట్టడిలో నాగర్​కర్నూల్ జిల్లా పూర్తి స్థాయిలో విజయం సాధించిందని కలెక్టర్​ శ్రీధర్​ అన్నారు. మరికొన్ని రోజులు ప్రజలు ఇదేవిధంగా ప్రభుత్వ నియమాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

collector sridhar visit to nagarkurnool district
నాగర్​కర్నూల్​లో కలెక్టర్​ పర్యటన

నాగర్​కర్నూల్​ జిల్లాలో రెండు కంటైన్మెంట్​ ప్రాంతాలను జిల్లా కలెక్టర్​ శ్రీధర్​, ఎస్పీ సాయిశేఖర్​తో కలిసి పరిశీలించారు. 20 రోజులుగా జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్​ కేసు నమోదు కాకపోవడం వల్ల రెడ్​జోన్లలో ఏర్పాటు చేసిన బారికేడ్లు తొలగించాలని అధికారులను ఆదేశించారు.

హోంక్వారంటైన్​లో ఉన్నవారు మరికొన్ని రోజులు ఇళ్లలోనే ఉండాలని కలెక్టర్​ సూచించారు. భౌతిక దూరం పాటించి జిల్లాను సేఫ్​ జోన్​గా ఉంచాలని కోరారు.

అనంతరం కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల అంతర్​రాష్ట్ర చెక్​పోస్టును కలెక్టర్​ తనిఖీ చేశారు. కర్నూల్ జిల్లాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండటం వల్ల సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఉంచాలని ఎస్పీని ఆదేశించారు. సరిహద్దు గ్రామాల్లోకి అపరిచితులెవరైనా వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details