తెలంగాణ

telangana

​ కంటైన్మెంట్​ జోన్​లలో శానిటేషన్​ చేస్తున్న అధికారులు

హైదరాబాద్​ నగరంలో రోజురోజుకు కరోనా విలయతాండవం చేస్తోంది. కుత్బుల్లాపూర్​ పరిధిలోని వైరస్​ బారిన పడిన పలు ప్రాంతాల్లో అధికారులు త్వరితగతిన శానిటేషన్​ పనులను చేస్తున్నారు.

By

Published : Jun 30, 2020, 8:04 PM IST

Published : Jun 30, 2020, 8:04 PM IST

Sanitation  in Kutbullapur containment zones, hyderabad
కుత్బుల్లాపూర్​ కంటైన్మెంట్​ జోన్లలో శానిటేషన్​ చేస్తున్న అధికారులు

మేడ్చల్​ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో రోజురోజుకు వైరస్ విజృంభిస్తోంది. వైరస్ బారిన పడిన ఇంటిని కంటైన్మెంట్ చేయడం.. ఆ ప్రాంతాన్ని రసాయనాలతో పిచికారీ చేసి.. బారికేడ్లు వేసి అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. వైరస్​ బారిన పడిన గాజులరామారం డిప్యూటీ కమిషనర్ కార్యాలయాన్ని శానిటేషన్ చేశారు.

ప్రజలెవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు. తప్పనిసరిగా మాస్క్​ ధరించాలని చేతులను శుభ్రం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి:యాదాద్రి ఆలయ పనుల పరిశీలన.. పురోగతిపై ఆరా

ABOUT THE AUTHOR

...view details