తెలంగాణ

telangana

ETV Bharat / state

మాస్కు లేకపోతే.. వెయ్యి కట్టాల్సిందే!

లాక్​డౌన్​ సడలింపు నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. బయటకు వచ్చేటప్పుడు మాస్కు లేకపోతే వెయ్యి రూపాయల జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఈ నిబంధన రాష్ట్రంలో అమలు చేస్తున్నారు కూడా. మేడ్చల్​ జిల్లాలోని దుండిగల్​లో అధికారులు మాస్కులు, హెల్మెట్​ లేని వాహనదారులకు జరిమానా విధించారు.

By

Published : May 19, 2020, 8:28 PM IST

Officers Charge Fine For no mask
మాస్కు లేకపోతే.. వెయ్యి కట్టాల్సిందే!

మేడ్చల్​ జిల్లా దుండిగల్​ పురపాలిక పరిధిలోని బహదూర్​ పల్లిలో మాస్కులు లేకుండా, హెల్మెట్​ ధరించకుండా ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారికి అధికారులు జరిమానా విధించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు.. దుండిగల్​ మున్సిపల్​ కమిషనర్​ సురేష్​ మున్సిపాలిటీలోని పలు ప్రాంతాల్లో పర్యటించి మాస్కులు లేని వారికి జరిమానా విధించారు. జరిమానా కట్టలేని వారితో గుంజీలు తీయించారు.

ABOUT THE AUTHOR

...view details