తెలంగాణ

telangana

By

Published : May 13, 2021, 7:09 PM IST

ETV Bharat / state

కరోనా రోగులకు మెరుగైన సేవలందాలి: మల్లారెడ్డి

కొవిడ్‌ రోగులకు మెరుగైన వైద్య సేవలందాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి వైద్యాధికారులకు సూచించారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లోని జిల్లా ఉప వైద్య ఆరోగ్య కేంద్రాన్నిపరిశీలించారు.

కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లోని జిల్లా ఉప వైద్య ఆరోగ్య కేంద్రాన్ని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సందర్శించారు. కొవిడ్‌ రోగులకు మెరుగైన సేవలందాలన్నారు. అవసరమైన మందులు, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు, ఆక్సిజన్‌ సరఫరాలో కొరత రాకుండా చూసుకోవాలన్నారు.

ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా నియోజకవర్గంలోని స్థానిక ప్రజా ప్రతినిధులతో మాట్లాడారు. గ్రామాల వారీగా కొవిడ్‌ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సురారంలో మల్లారెడ్డి మెడికల్‌ కళాశాల వారి సౌజన్యంతో 300 పడకల ఉచిత ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేశారని చెప్పారు. కరోనా బాధితులు ఉచిత ఐసోలేషన్‌ను ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు.

ఇదీ చదవండి:రెండోరోజూ గ్రేటర్​లో లాక్‌డౌన్‌ అమలు.. నిర్మానుష్యంగా రోడ్లు

ABOUT THE AUTHOR

...view details