తెలంగాణ

telangana

వివాహేతర సంబంధం నెపంతో ఓ వ్యక్తిపై కత్తులతో దాడి

మేడ్చల్ జిల్లా షామీర్ పేట్ పోలీస్​స్టేషన్ పరిధిలోని లాల్​గాడి మలక్​పేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిపై దారుణంగా కత్తులతో దాడిచేశారు.

By

Published : Nov 6, 2019, 3:48 AM IST

Published : Nov 6, 2019, 3:48 AM IST

వివాహేతర సంబంధం నెపంతో ఓ వ్యక్తిపై కత్తులతో దాడి

మేడ్చల్​ జిల్లా లాల్​గాడిమలక్​పేట గ్రామానికి చెందిన మహేశ్​ అనే వ్యక్తిపై కత్తులతో దాడిచేశారు. జహంగీర్ అలియాస్ జంగయ్య అనే వ్యక్తి భార్యతో మహేశ్​ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో... గత రాత్రి మహేష్ ఇంట్లోకి చొరబడి జంగయ్య కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి కత్తులతో దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన మహేశ్​ను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహేశ్​ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహేష్ స్థానిక గ్రామ పంచాయితీ కార్యాలయంలో వాటర్​మెన్​గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

వివాహేతర సంబంధం నెపంతో ఓ వ్యక్తిపై కత్తులతో దాడి

ABOUT THE AUTHOR

...view details